బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా నేడు పదవీస్వీకారం చేసిన బండి సంజయ్ కుమార్ ను తెలంగాణ బిజెపి కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంఎల్ సి పొంగులేటి సుధాకర్ రెడ్డి అభినందించారు. శాలువా కప్పి ఆయనకు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా పని చేయాలని ఆయన అభిలషించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సేవలో మరింత చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు.
ప్రధాని నరేంద్ర మోడీ, హో మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా అందిస్తున్న నాయకత్వానికి సహకారం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే విధంగా వత్తడి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కోరారు. రైతులు, వలస కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సుధాకర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు కూడా పాల్గొన్నారు.