భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపుడి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కాళ్ళూరి యతిరాజ్ కుమార్ ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుండెపుడి గ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లి యతిరాజ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తండ్రి కాళ్ళూరి వెంకటేశ్వరరావు, సోదరులు ప్రభాకర్ రావు, ప్రవీణ్ కుమార్, కుటుంబ సభ్యులను మాజీ ఎంపీ పొంగులేటి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు పాతికేళ్లపాటు పాత్రికేయునిగా పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారం, సమాజాభివృద్ధి కోసం పాటుపడిన సీనియర్ రిపోర్టర్ రాజు మృతి బాధాకరమన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తున్న రాజు మరణం పాత్రికేయ సమాజానికి తీరని లోటని సంతాపాన్ని ప్రకటించారు. ఇదే గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పంచాయతీ గుమస్తా సిరోజు వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించి ఆర్దిక సహాయం చేశారు. దుఃఖంలో ఉన్న వెంకటేశ్వర్లు భార్య, పిల్లలను ఓదార్చి అండగా ఉంటానని మనోధైర్యాన్ని ఇచ్చారు. అనంతారం గ్రామానికి చెందిన బండారు వెంకటేశ్వర్లు కుమారునికి ఇటీవల వివాహం జరిగింది. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదనరావు, ధారావత్ రాంబాబు, శ్రీనాధరాజు నాగరాజు పాల్గొన్నారు.
previous post