సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి మండలం పోనుగొడు గ్రామంలోని శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి శాంతి కళ్యాణ బ్రహ్మోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
మూల విరాట్ కు అభిషేకము, లక్షకుంకుమార్చన, క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయస్వామి వారికి లక్ష నాగవల్లి దళాలతో పూజ (ఆకుపూజ) కార్యక్రమాన్ని అర్చకులు వైభవోపేతంగా నిర్వహించారు.
ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి, రజిత దంపతులు పాల్గొని ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు,విశేష సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.