నారా లోకేష్ యువ గళం పాదయాత్ర లో పాల్గొని రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహన కార్యదర్శి పొనుగోటి శ్రీనివాసరావు సంఘీ భావం తెలియ చేశారు. యువత, రైతు సమస్యలపై యువ గొంతుకై, మహిళా సమస్యలపై యువగళ మై పాదయాత్ర చేపట్టిన నారా లోకేష్ కి ప్రజల భ్రహ్మరధం పడుతున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి యువతను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, మహిళల ను మోసం చేశారు బడుగు బలహీన వర్గాలను మోసం చేశారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ఎన్నికలకు ముందు ఎన్నో అలివి గాని హామీలు ఇచ్చి ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే, యువతకు ఉద్యోగాలు కావాలంటే, రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే ఏకైక మార్గం నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడమేనన్నారు. దీనికి తెలుగు యువత ముందుండి పోరాడుతుందని రాష్ట్ర తెలుగుయువత కార్యనిర్వహణ కార్యదర్శి పోనుగోటి శ్రీనివాసరావు తెలిపారు.
previous post