లాక్ డౌన్ కారణంగా పనులు లేక పస్తులుంటున్న పేద ప్రజలకు మాధవరం రంగారావు యువసేన ఆధ్వర్యంలో నేడు ఆహారం అందచేశారు.
శేరిలింగం పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ 33 బ్లాక్ లో మొత్తం 300 మంది ఇతర జిల్లాల నుంచి వలస వచ్చిన కార్మికులకి ఆహారం అందచేశారు. మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, గొట్టిముక్కల పెద్ద భాస్కర్, చంద్రకాంతరావు, హరినాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అందిస్తున్న స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ నాయకులు మహేష్, చంద్రమోహన్ సాగర్, శ్రీనివాస్ సాగర్, కుమారస్వామి, సోములు, హిమగిరి రావు, రామచంద్ర రావు పాల్గొన్నారు. ఇంకా యాదగిరి,సత్యనారాయణ చారి, గంగాధర్ సాగర్, విద్యాసాగర్, సత్యనారాయణ, వెంకటస్వామి సాగర్, రాజు, నరసింహ, ఆంజనేయులు, బాబు, వెంకట్, యశ్వంత్, కమలమ్మ, లక్ష్మి, సంజమ్మ పాల్గొన్నారు.