30.3 C
Hyderabad
March 15, 2025 10: 56 AM
Slider ఖమ్మం

భూ భారతి ద్వారా పేదల హక్కులు పటిష్టం

రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి, అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ లతో కలిసి ఖమ్మం జిల్లా కల్లూరు ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో రూ. 5 లక్షల అంచనా విలువతో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు మోడల్ ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి తినేందుకు సరిపడా భోజనం, కట్టు కునేందుకు బట్టలు, ఉండటానికి ఒక చిన్న ఇల్లు ఉండాలని కోరిక ఉంటుందని అన్నారు. పేదలకు సొంత ఇల్లు కల్పించాలని గతంలో వైయస్సార్ హయంలో రికార్డు స్థాయిలో ఇండ్ల నిర్మాణం జరిగిందని, నేడు మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా ఇండ్లు నిర్మిస్తున్నామని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద మొదటి విడతగా ప్రభుత్వం నాలుగున్నర లక్షల ఇండ్లను మంజూరు చేస్తుందని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం నమూనాల కోసం ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్ ఒకటి నిర్మిస్తామని, సుమారు 600 ఇందిరమ్మ ఇండ్లు మోడల్ హౌస్ లు నిర్మించడం జరుగుతుందని, కల్లూరు మండల ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో నమూనా ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశామని అన్నారు.

మోడల్ హౌస్ ను పరిశీలించి తక్కువ ధరతో నాణ్యతతో ఇల్లు ఎలా కట్టాలో పేదలు పరిశీలించి, వారి స్థలాలలో నిర్మించుకోవాలని మంత్రి సూచించారు. ఇంటిలో నివసించే ప్రజలే నిర్మాణం చేసుకునేలా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఇంటి నిర్మాణానికి ఎటువంటి నిబంధనలు లేవని, 400 చదరపు అడుగులు తగ్గకుండా స్థలంలో ఒక బాత్ రూమ్, ఒక కిచెన్ ఉండేలా నిర్మాణం చేసుకోవాలని మంత్రి తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల క్రింద సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం 4 విడతలలో అందుతుందని, ఫౌండేషన్ వేసిన తర్వాత లక్ష రూపాయలు, కిటికి దశ తర్వాత లక్ష పాతిక వేలు, స్లాబ్ దశ చేరిన తర్వాత లక్ష 75 వేల రూపాయలు, ఇళ్లు పూర్తి చేసిన తర్వాత మరో లక్ష రూపాయలు మొత్తం ఐదు లక్షల సహాయం పేదలకు ఇంటి కోసం అందుతుందని అన్నారు.

వివిధ కారణాలు చూపి ప్రజలకు ఇండ్లు ఎగ్గొట్టే ఉద్దేశం ప్రజా ప్రభుత్వానికి లేదని, రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లు నిర్మించాలని ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. పేదలకు రాజకీయ పార్టీలు, కుల, మతాల కతీతంగా అర్హులకు ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు.

ప్రజా పాలనలో ప్రతి గ్రామం నుంచి సేకరించిన దరఖాస్తులలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీటిలో అర్హులైన దరఖాస్తులను ఎంపిక చేసేందుకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా సర్వే చేపట్టామని, ఇప్పటి వరకు 21 లక్షల 17 వేల 734 మంది సర్వే పూర్తయిందని అన్నారు. డిసెంబర్ నెలాఖరులోపు సర్వే పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు.

రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రీన్ ఛానల్ లో నిధులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ కు ఎక్కువ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇండ్ల నిర్మాణాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని అన్నారు.

సత్తుపల్లి నియోజకవర్గానికి గతంలో మంజూరై లబ్ధిదారులకు అందించని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని, వీటి నిర్మాణం పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని అన్నారు. పేద ప్రజలకు అభద్రతా భావం తొలగించి, వారిలో విశ్వాసం కల్పించేందుకు తెలంగాణ భూ భారతి చట్టం 2024 ప్రవేశపెట్టామని అన్నారు.

గతంలో పెండింగ్ ఉన్న 9 లక్షల సాదా బైనామా దరఖాస్తులకు ఇందిరమ్మ ప్రభుత్వం పరిష్కరిస్తుందని అన్నారు. ప్రజల కోసం తయారు చేస్తున్న భూ భారతి చట్టం సభలో ఆమోదం జరిగే సమయంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు అసెంబ్లీకి హాజరు కాకపోవడం విచారకరమని అన్నారు. కల్లూరు మండలంలో డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల మంజూరుకు కృషి చేస్తానని, అదే విధంగా రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజల డిమాండ్ మేరకు నెల రోజులలో కల్లూరు మున్సిపాలిటీ మంజూరు చేస్తామని అన్నారు.

Related posts

హుజూర్ నగర్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

Satyam NEWS

సాగునీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం

Satyam NEWS

మహిళా ఉద్యోగిని వేధించిన పశ్చిమబెంగాల్ గవర్నర్

Satyam NEWS

Leave a Comment