25.2 C
Hyderabad
March 23, 2023 01: 07 AM
Slider తెలంగాణ

బహిర్భూమికి వెళ్లినందుకు పేదవాడికి జరిమానా

pjimage (6)

పాపం అతను ఎంతో పేదవాడు. రోజు కూలి చేసుకుని బతికేవాడు. అయితే గ్రామంలో బహిరంగ మలమూత్ర విసర్జన చేసాడని అతనిపై భరించలేని జరిమానా విధించారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం విఠలపూర్ గ్రామములో జరిగిందీ ఘటన. ఆ గ్రామానికి చెందిన  తలరి నర్సప్ప అనే వ్యక్తి బహిర్భూమికి వెళ్లడంతో పంచాయతీ కార్యదర్శి  అతనికి 500 రూపాయల జరిమానా విధించారు.తాను చేసిన పని నేరమని అప్పటి వరకూ అతనికి తెలియదు. ఆతర్వాత జరిమానా చూసి తెలుసుకున్న ఆ వ్యక్తి గత్యంతరం లేక వేసిన జరిమానాను కట్టి రసీదు తీసుకున్నాడు.నిన్న మొన్నటి వరకు హరితహారంలో నాటిన మొక్కలను తిన్నందుకు మేకలకు, పశువులకు జరిమానాలు విధించిన అధికారులు ఇక ఇప్పుడు బహిర్భూమికి వెళ్లిన మనుషులకు జరిమానాలు మొదలు పెట్టారు.

Related posts

కడప జిల్లాలో కోవిడ్ తో సబ్ పోస్ట్ మాస్టారు మృతి

Satyam NEWS

మోడీ తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి

Satyam NEWS

నిజామాబాద్ రోటరీ క్లబ్ సేవలు ప్రశంసనీయం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!