39వ అఖిలభారత మేజర్ పోర్టు లే క్రికెట్ ఛాంపియన్ షిప్ ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమాన్ని పోర్టు క్రికెట్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోర్టు డిప్యూటీ చైర్మన్ హరినాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గెలుపొందిన జట్లకు డిప్యూటీ చైర్మన్ బహుమతులు అందజేశారు.
ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచిన ముంబై జట్టును డిప్యూటీ చైర్మన్ అభినందించారు. రన్నరప్ గా నిలిచిన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ జట్టు మంచి పోరాట పటిమను కనబర్చిందని కితాబు ఇచ్చారు. ఇరు జట్లు విజయం కోసం శ్రమించటం తో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగిందని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని డిప్యూటీ చైర్మన్ అన్నారు.
ఈ సందర్భంగా టోర్నమెంటులో ప్రతిభ కనపరిచిన ఆటగాళ్లకు మెమెంటో అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు పోర్టు క్రికెట్ స్టేడియంలో ముంబై జట్టు విశాఖపట్టణం జట్ల మధ్య ఫైనల్ పోరు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ముంబై జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన విశాఖపట్టణం జట్టు 19 ఓవర్లలో 131 పరుగులు చేసి ఇ ఆలౌట్ అయ్యింది. అనంతరం 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 39వ ఆలిండియా మేజర్ ఫోర్స్ క్రికెట్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది గత ఏడాది కూడా ముంబై జట్టు విజేత కావడం గమనార్హం.