కడప జిల్లా పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రేపల్లె వాగు ఉధృతికి కాజ్ వేపై నీటి ప్రవాహంలో చిక్కుకున్న 5 మంది మహిళలను పోలీసులు కాపాడారు.
కొట్టాల పల్లి గ్రామం నుండి పనిపై గానుగపెంటకు వారు వచ్చారు. మొదట్లో ప్రవాహం తక్కువ ఉండటంతో సులువుగా గ్రామం నుండి వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో కొద్దీ దూరం వచ్చి ప్రవాహ ఉదృతి కి నిలిచిపోయి రక్షించాలంటూ కేకలు వేశారు. పోరుమామిళ్ల నుండి చెరువులు, వాగులు, నదుల ప్రమాదకర స్థితిని తెలుసుకునే విధుల్లో తిరుగుతున్న పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతయ్య, కానిస్టేబుల్ ఓబులేసు మహిళల ఆర్తనాదాలు విని కాపాడేందుకు రంగంలోకి దిగారు.
హెడ్ కానిస్టేబుల్ తిరుపతయ్య, ఓబులేసు సమయస్ఫూర్తితో కాజ్ వే వంతెన మధ్యకు వెళ్లి బాధిత మహిళలను ఒడ్డుకు చేర్చారు. తమ ప్రాణాలను కాపాడిన పోరుమామిళ్ల పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతయ్య, ఓబులేసు లకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.
పోలీసు శాఖకు రుణపడి ఉంటామన్నారు. ఐదుగురి ప్రాణాలను కాపాడిన సిబ్బందిని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ అభినందించారు.