తమిళనాడు రాష్ట్రం మర్కజ్ జమాత్ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. ఒక్కరోజే 50 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడు నుండి ఢిల్లీ వెళ్లిన వాళ్ళు మొత్తం 1500 మంది కాగా వారిలో కేవలం 515 మందిని మాత్రమే ఇప్పటి వరకూ గుర్తించారు. మిగతా వారి ఆచూకీ లభ్యం కాలేదు.
దాంతో తమిళనాడు ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఢిల్లీ వెళ్లి వచ్చిన అందరి కోసం గాలిస్తున్నారు కానీ దొరకడం లేదు. నేడు పాజిటీవ్ కనిపించిన కేసులతో కలిపి తమిళనాడులో 124కు పాజిటీవ్ కేసులు పెరిగాయి. వారిలో 45 మంది ఢిల్లీ వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం.