39.2 C
Hyderabad
April 25, 2024 17: 27 PM
Slider వరంగల్

ములుగు జిల్లా కుగ్రామంలో కూడా కరోనా పాజిటీవ్ కేసులు

#CoronaTest

ములుగు జిల్లా అబ్బాపూర్ లో కరోనా పరీక్షలు నిర్వహిస్తే నేడు 9 పాజిటీవ్ కేసులు బయటపడ్డాయి. ములుగు జిల్లా టీబీ,ఎయిడ్స్, లెప్రసి నియంత్రణాధికారి డాక్టర్ పోరిక రవీందర్ ఆధ్వర్యంలో అబ్బాపూర్ లో 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇందులో తొమ్మిది(9) మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత, మంచి పోషకాహారం తీసుకోవడంతో పాటుగా భౌతిక దూరం పాటించాలని చెప్పారు.

జలుబు,దగ్గు,జ్వరం ఉన్నవారు వెంటనే ప్రాథమిక పరీక్ష కేంద్రాన్ని వెళ్లి తప్పనిసరి గా కరోనా పరీక్ష చేసుకోవాలని అన్నారు.

ఒకవేళ కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయితే మొదటగా ప్రజలు మానసికంగా కృంగిపోరాదని మనోధైర్యంతో కరోనా ను జయించాలని డాక్టర్ పోరిక రవిందర్ పిలుపునిచ్చారు.

Related posts

సెలబ్రిటీస్ అందరి దృష్టి ఇప్పుడు బ్రాండ్ మందిర్ పైనే

Satyam NEWS

బంగారం ధరకు రెక్కలు …50వేలకు త్వరలో

Satyam NEWS

అనుకున్న సమయానికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అందించాలి

Satyam NEWS

Leave a Comment