ఉత్తర్వులు జారీ చేసి హోం శాఖ కార్యదర్శి విశ్వజిత్ కుమార్
ఏపీలో ఆ రాష్ట్ర హోం శాఖ….. 52 అడిషనల్ ఎస్పీలకు పోస్టింగ్ లు ఇచ్చింది. అందులో ఇటీవలే 35 మంది ఏఎస్పీలకు పదోన్నతి రాగా..ఖాళీ గా ఉన్న వారికి…కీలకమైన ప్రదేశాలలో రెగ్యులర్ ఏఎస్పీలు గా పోస్టింగ్ లుఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.అలాగే మరో 12 అడిషనల్ ఎస్పీలకు బదిలీ చేసారు.
విజయవాడ,విజయనగరం,అనంతపురం తూర్పుగోదావరి,అనంతపురం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, అనకాపల్లి, కర్నూలు, తిరుపతి, కడప, రాజమహేంద్రవరం, కాకినాడ, నెల్లూరు, ఏలూరు ,శ్రీకాకుళం, నంద్యాల, పశ్చిమగోదావరి, చిత్తూరు,శ్రీకాకుళంలలో పని చేస్తున్న డీఎస్పీలకు ఇటీవలే ఏఎస్పీలుగా పదోన్నతి లభించింది.
దాదాపు ఏఎస్పీలుగా పదోన్నతి వచ్చిన వారందరూ డీఎస్పీలుగా పని చేసిన చోటే…ఏఎస్పీలుగా ఉంటూ..సంబందిత డివిజన్ లకు ఇంచార్జ్ డీఎస్పీలుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా…రాష్ట్ర డీజీపీ సూచనలతో హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి.. వెయింటింగ్ లో ఉన్న ఈ 35 మంది డీఎస్పీలకు పోస్టింగ్ లు ఇస్తూ…ఉత్తర్వులు జారీ చేసింది.