35.2 C
Hyderabad
April 24, 2024 14: 42 PM
Slider గుంటూరు

రాజధాని అంటే రాజకీయ కండువా కాదు

#potulabalakotaiah

డొక్కా వ్యాఖ్యలను తప్పు పట్టిన బాలకోటయ్య

రాజధాని భూములపై ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతులు బాలకోటయ్య పూర్తిగా తప్పుపట్టారు. బుధవారం ఆయన ఒక ప్రకటన చేస్తూ అమరావతి రాజధాని భూములపై రాజధాని రైతులకు ఎలాంటి హక్కులు లేవని, వందేళ్లయిన అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కాదని చేసిన వ్యాఖ్యలు పేగు పంచి ఇచ్చిన తల్లిని నిందించటం వంటిదని, పుట్టి పెరిగిన జన్మభూమిపై నిందలు వేయటం వంటిదని అభివర్ణించారు.

కోర్టు పరిధిలోని అంశం పై ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా ఆయనకు లేదు అన్నారు.రాజధాని అంటే మెడలోని కండువాలు మార్చటం కాదని, కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి, తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలోకి జంప్ చేయడం కాదని ఎద్దేవా చేశారు. రాజధానిలో 34 శాతం దళితులు భూములు ఇస్తున్నప్పుడు ఇదే మాట ఎందుకు అనలేదని ప్రశ్నించారు.

రాజధాని భూముల సమీకరణలో పాలుపంచుకొని, ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, దాటాక బోడి మల్లన్న అన్నట్లు ముఖ్యమంత్రి మెప్పుకోసం రైతులపై రాళ్లు వేస్తున్నారని ఆరోపించారు. 2024 తర్వాత ఎమ్మెల్సీ డొక్కాకి రాజకీయ జీవితం ఉండబోదని, రాజకీయాల నుంచి కనుమరుగైపోతారని హెచ్చరించారు.రైతులపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.

Related posts

హైదరాబాద్ నగరానికి గ్రీన్ సిటీ అవార్డు

Satyam NEWS

టమాటా తో కోటేశ్వరులు

Bhavani

పుష్పపల్లకీపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామి ద‌ర్శ‌నం

Satyam NEWS

Leave a Comment