సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి మండలం పోనుగోడు గ్రామంలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి జెండా పండుగ కార్యక్రమానికి సోమవారం శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో,పాడి పంటలతో ఉండాలని,కోరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ జోగు సరోజిని పిచ్చిరెడ్డి,తెరాస మండల పార్టీ అధ్యక్షుడు జోగు అరవింద్ రెడ్డి,జోగు విరారెడ్డి,అనంతు కరుణాకర్,కారింగుల మధు, బత్తిని శివ,విశ్వబ్రాహ్మణుల కుల పెద్దలు తుంగతుర్తి వెంకయ్య, సత్యనారాయణ, రామకృష్ణ, పవన్ కుమార్, వెంకన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.