సమస్య పరిష్కారించి బాధితులకు భరోసా కల్పించడమే “ప్రజాదివాస్” ముఖ్య ఉద్దేశమని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజాదివాస్ కార్యక్రమం ఈరోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది.
కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 23 బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిస్కారం కోసం బాధితులు ఇచ్చే ప్రతి పిర్యాదుపై కచ్చితంగా స్పందించి… వాస్తవాలకు అనుగుణంగా వారికి సత్వర న్యాయం అందించడం లక్ష్యంగా పనిచేయాలని పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.