36.2 C
Hyderabad
April 23, 2024 19: 15 PM
Slider ఖమ్మం

బాధితులకు భరోసా కల్పించేందుకే ప్రజా దివాస్

#khammampolice

బాధితులకు భరోసా కల్పించేందుకు ప్రజాదివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. ఫిర్యాదులోని వాస్తవ పరిస్థితులకు పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్న ప్రజాదివాస్ కార్యక్రమంలో సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీస్ కమిషనర్ సమస్యలకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్ధాయిలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  ఫిర్యాదులో అధికంగా భూ వివాదాలు, కుటుంబ , వ్యక్తిగత సమస్యలతో పాటు   ఆర్ధిక లావాదేవీలపై వచ్చిన   ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సంబంధిత  పోలీస్ అధికారులకు సూచించారు.

Related posts

యాదగిరి గుట్టలో విషాదం: భవనం నేల కూలి నలుగురి మృతి

Satyam NEWS

గోవింద నామ‌స్మ‌ర‌ణ‌తో ద్వార‌క‌ను త‌ల‌పించిన తిరుమ‌ల‌

Satyam NEWS

సంక్రాంతికి ఊరికి వెళితే ముందస్తు సమాచారం ఇవ్వండి

Satyam NEWS

Leave a Comment