రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాడు అల్లంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం నుండి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా డికె. బంగ్లా లో నేడు ప్రజా సంకల్ప యాత్ర వాల్ పోస్టర్ విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణ మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏప్రిల్ 14 వ తేదీ నుండి జోగులంబ అమ్మవారి ఆలయం నుండి అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని పాదయాత్ర అక్కడే ప్రారంభిస్తారని అన్నారు.
అలంపూర్ నుండి గద్వాల, మక్తల్, నాగర్ కర్నూల్, మహేశ్వరం, ప్రాంతాల మీదుగా పాదయాత్ర ఉంటుందన్నారు. ఈ యాత్రలో బిజెపి అభిమానులు, కార్యకర్తలు, వివిధ సంస్థలకు చెందిన సంఘాలు పాల్గొనాలని అన్నారు. దళితుల మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా అన్ని సంఘాల కలసి రావాలని విజ్ఞప్తి చేసారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు అప్సర్ పాషా, యాత్ర సహా ప్రముఖ్ వీరేందర్ గౌడ్, యాత్ర అల్లంపూర్ అసెంబ్లీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మల్లారెడ్డి ,ఎర్ర మహేష్, గద్వాల అసెంబ్లీ కోఆర్డినేటర్స్ v. రాజ వర్ధన్ రెడ్డి, శ్రీమతి బండ కార్తీకరెడ్డి, కొండాపూర్ జగన్,రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.