27.7 C
Hyderabad
April 26, 2024 03: 08 AM
Slider మహబూబ్ నగర్

పెండింగ్‌ ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి

#collector

వివిధ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న 307 ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్క రించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్ సంబంధిత  అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి అనంతరం నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి ప్రజావాణికి వచ్చిన వివిధ అంశాలకు సంబంధించిన సమస్యలు అన్ని శాఖలలో 307 వినతులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

వాటిని వెంటనే  పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ వారం ప్రజావాణి లాగిన్‌ చెక్‌ చేసి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి పంపించాలన్నారు. మండల రెవెన్యూ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి వివరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 36 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో ఎక్కువగా భూ సమస్యలకు సంబంధించివే ఉన్నాయి. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు జిల్లా అధికారులు వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్

Related posts

కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి భారత్ కు విముక్తి

Satyam NEWS

కేబినెట్‌లో చోటు, భారీగా డబ్బు .. బీజేపీపై ఆప్ ఎంపీ గరం

Sub Editor

వేద విద్వ‌త్ ఆగ‌మ స‌ద‌స్సుకు మెరుగ్గా ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment