పంచలోహ విగ్రహాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని ప్రకాశంజిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇతని వద్ద నుంచి 50 లక్షల విలువైన రెండు పంచలోహ విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశంజిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు, దొంగతనాలపై నిఘా వుంచిన ప్రకాశంజిల్లా పోలీసులు ముందస్తు సమాచారంతో అద్దంకిలో తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలోనే అద్దంకి బస్టాండు వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా మార్టూరు గ్రామానికి చెందిన కరిముల్లా అనే వ్యక్తి అనుమానస్పదంగా కనిపించడంతో పోలీసులు అతన వద్ద వున్న గోనె సంచిని తనిఖీ చేశారు. దీనిలో విష్ణుమూర్తి, సత్యభామల పంచలోహ విగ్రహలు వున్నాయి.
దీంతో కేసు నమోదుచేసి విచారణ చేపట్టిన పోలీసులు విజయవాడలోని సాయి మోడల్ గ్రామానికి చెందిన మెండు నటరత్న సంజయ్ నాధ్ ఈ విగ్రహలను తనకు ఇచ్చినట్లు కరిముల్లా చెప్పాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పంచలోహవిగ్రహల విలువ 50 లక్షల రూపాయలు వుంటుందని పోలీసులు తెలిపారు. కేసులో మరో నిందితుడు పరారీలో వున్నాడు.