కృష్ణానదీ పరీవాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు జల కళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో విజయవాడలోని ప్రకాశం బ్యారేజి కళకళ లాడుతున్నది.
మొత్తం 40 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం నుంచి వరద నీరు వదులుతున్నారు. నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు పూర్తిగా నిండకపోయినా వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని నీటిని వదులుతున్నారు.
ఈ కారణంగా ఎగువ నుంచి ప్రవాహం ఎక్కువగానే వస్తున్నది. ప్రకాశం బ్యారేజి నుంచి నీటిని వదిలేయడంతో లంక గ్రామాలకు వరద నీటి ముప్పు ఏర్పడుతున్నది.