39.2 C
Hyderabad
April 23, 2024 18: 34 PM
Slider ఆధ్యాత్మికం

హనుమంత వాహనంపై ప్రసన్న వేంకటేశ్వరస్వామి

#Tirumala

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం హ‌నుమంత వాహ‌నంపై కోదండ‌రాముని అలంకారంలో స్వామివారు ద‌ర్శ‌మిచ్చారు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు.

రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడిగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధిచెందాడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన మహనీయులు కనుక వీరిని ద‌ర్శించిన

వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. మ‌ధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు పుణ్యాహవచనం, వసంతోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సూప‌రింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ పాల్గొన్నారు.

Related posts

ఇంకా తేలని నరేంద్రగిరి అఖాడా డెత్ మిస్టరీ

Sub Editor

శాడ్ స్టోరీ: గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Satyam NEWS

సీఎం పర్యటన కోసం కొండగట్టులో ఏర్పాట్లు

Bhavani

Leave a Comment