28.7 C
Hyderabad
April 25, 2024 03: 55 AM
Slider ప్రత్యేకం

పీకే టీమ్ స్ట్రాటజీ: ఆంధ్రాలో అన్నకు… తెలంగాణలో చెల్లికి

#prashantkishore

ఆంధ్రాలో అన్నకు సలహాలు ఇస్తున్న ప్రశాంత్ కిషోర్ తెలంగాణ లో చెల్లితో జతకట్టారు. తెలంగాణ లో రాజకీయ పార్టీ పెట్టిన వైయస్ షర్మిలతో ప్రశాంత్ కిశోర్ టీమ్ నేడు లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో సమావేశం అయింది.

ఈ భేటీలో పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణ, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, పాదయాత్ర తదితర అంశాలపై చర్చిస్తున్నారు.

ప్రశాంత్ కిశోర్ టీమ్ సేవలు తీసుకోనున్నట్టు ఇటీవలే షర్మిల ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఆమె చెప్పిన రోజుల వ్యవధిలోనే పీకే టీమ్ రంగంలోకి దిగింది.

రాబోయే ఎన్నికల సమయాని కల్లా పార్టీని ఇతర ప్రధాన పార్టీలకు దీటుగా తయారు చేయడమే లక్ష్యంగా పీకే టీమ్ పని చేయనుంది. పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలన్నింటినీ నిర్వహించనుంది.

Related posts

శ్రీపురం రంగనాయక స్వామి ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్

Satyam NEWS

విశాఖలో పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్

Satyam NEWS

దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

Bhavani

Leave a Comment