రైలు ప్రమాదాల సీజన్ కొనసాగుతున్నట్లుగా కనిపిస్తున్నది. తాజాగా భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఏసీ కోచ్ చక్రం బోల్ట్ ఊడిపోయింది. అయితే ఈ విషయాన్ని సిబ్బంది గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే గుంటూరు రైల్వే స్టేషన్ లో రైలును నిలిపి వేశారు. 3 గంటలుగా ప్రయాణీకులు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ నిలిచిపోవడం ఇతర రైళ్ల షెడ్యూల్ పై కూడా ప్రభావం చూపింది. ఏసీ కోచ్ చక్రం బోల్ట్ ఎలావూడిందో అర్ధం కావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. అయితే బోల్ట్ వూడినట్లు గమనించడంతో రైలు నిలిపి వేసి, ఏసీ కోచ్ ను రైలు నుంచి విడదీసి మరో బోగిని రైల్వే సిబ్బంది అమర్చారు. అయితే ప్రయాణీకుల కష్టాలు మాత్రం ఎవరూ తీర్చలేదు.
previous post