అనంతపురం నగరం లో దారుణం జరిగింది. వరకట్న వేధింపులతో ఒక గర్భిణి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ఈ ప్రాంతంలో సంచలనం కలిగించింది.
నగరంలోని ఎర్రనాల కొట్టాల లో ఈ దారుణం జరిగింది. ఉరివేసుకున్న యువతి 2 నెలల గర్భవతిగా పోలీసులు తెలిపారు.
తన గదిలో ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. వరకట్న వేధింపులతో తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
DSP వీర రాఘవ రెడ్డి కేసు విచారణ చేపట్టారు.