భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంలో వివిధ అసోసియేషన్ల పాత్ర కీలకమని బిజెపి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. ఈరోజు హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ ఇప్పటి తరానికి భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయాల్సిన అవశ్యకత ఎంతో ఉందని అన్నారు. వాటిలో అసోసియేషన్ల పాత్ర చాలా కీలకమని ఈరోజు పబ్లిక్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ ముగ్గుల పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయం , వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రిటైర్డ్ ఎంప్లాయీస్ & టీచర్స్ సెల్ రాష్ట్ర కో చైర్మన్ విజయలక్ష్మి, ఉపాధ్యక్షురాలు గిరిజ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి రాజకుమార్, అసోసియేషన్ పెద్దలు రాజయ్య, జాన్ మొహమ్మద్, రంగాచార్యులు, ఓంకార్ సింగ్, దేవనందం, గడిపెల్లి మధు, జగన్, విజయ్ కుమార్, సత్యనారాయణ రెడ్డి, రాఘవ రెడ్డి, సారయ్య, కృష్ణ, రాజీ రెడ్డి, ప్రసున్న రెడ్డి, ప్రమీల, కళావతి తదితరులు పాల్గొన్నారు.