నిర్భయ దోషులకు క్షమాబిక్షకు అర్హులు కాదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు.నిర్భయ సామూహిక హత్యాచార దోషి ముకేష్ సింగ్ క్షమాభిక్ష అభ్యర్థనను అయన తిరస్కరించారు . ముకేష్ సింగ్ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రపతి భవన్కు సిఫార్సు చేశఆరు. వెంటనే రాష్ట్రపతి ముకేష్ సింగ్కు క్షమాభిక్షను నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీచేశారు
అంతకు ముందు అమీషా కూడా వారి .క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించారు. ఈ నెల 22న మరో ముగ్గురు దోషులతో కలసి ముకేష్ సింగ్కు ఉరిశిక్ష ఖరారైన నేపథ్యంలో తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ ముకేష్ రాష్ట్రపతికి చివరి నిమిషంలో దరఖాస్తు చేసుకున్నాడు. రాష్ట్రపతి నిర్ణయాన్ని తీహార్ జైలు అధికారులకు రాష్ట్రపతి భవన్ తెలియచేసింది.కాగా జైలు అధికారులు ఉరిశికేశాను వాయిదావేయాలని ఢిల్లీ సర్కార్కు ఒక అభ్యర్థన చేయడం గమనార్హం.