అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన ఖరారైన నేపథ్యం లో ట్రంప్ కు మోడీ ట్వీటర్ వేదికగా స్వాగతం పలుకుతున్నారు. భారత్కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాక అత్యంత ఆనందాన్ని కలిగిస్తుందని ప్రధాని నేడు మోదీ ట్వీట్ చేశారు. ఆత్మీయ అతిథికి మరిచిపోలేని స్వాగతం ఏర్పాటు చేస్తామని మోదీ అన్నారు.
ట్రంప్ రాక ప్రత్యేకమైందని భారత్, అమెరికా స్నేహబంధాన్ని బలోపేతం చేసేందుకు అది దోహదపడుతుందని అయన తెలిపారు. మన స్నేహబంధం వల్ల ప్రపంచ దేశాలకు కూడా మంచి జరుగుతుందని మోదీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.మొత్తానికి ట్రంప్ కు పభారత్ ప్రజలు నీరాజనాలు పలికే అవకాశం ఎక్కువగా ఉంది.