ములుగు మండలం పరిధిలోని జంగాల పల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యదర్శి శాంతకుమారి సందర్శించారు. 4 వ విడత పల్లె ప్రగతి కార్యక్రమములో భాగంగా గురువారం ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. అనంతరం పల్లె ప్రకృతి వనం పై గ్రామపంచాయతీ వారు చూపిన శ్రద్ధ పట్ల శాంతకుమారి, అదనపు కలెక్టర్ లు గ్రామ సర్పంచ్ కార్యదర్శులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనితా రాణి ప్రత్యేక అధికారి నవత వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.