విశాఖ ఎయిర్ ఫోర్టులో ఫిబ్రవరి 27 వ తేదిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయి అడ్డుకోవడం దారుణమైన చర్య అని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. చంద్ర బాబు పర్యటన లో భాగంగా ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఘటన పై అయన మంగళవారం రాత్రి సిపి ని కలిసి పిర్యాదు చేసారు.
ఎయిర్ పోర్ట్ లో కేవలం వైసీపీ నాయకులే నిరసన,దౌర్జన్యం చేసారు కానీ నగర ప్రజలు కాదు అని అయన అన్నారు. వైసీపీ నాయకులతో పాటు పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించారు అని అయన ఆరోపించారు. తనను జేబు దొంగ మాదిరిగా ఎయిర్ ఫోర్టు లాంజ్ లోకి లాక్కు వెళ్ళిన గాజువాక ఏసిపి పై త్వరలో ప్రైవేటు కేసు పెడతానని స్పష్టం చేశారు.