ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో కరోనా రోగులను ప్రయివేటు ఆసుపత్రులు చేర్చుకోవడం లేదు.
ఈ రోజు నుండి కోవిడ్ పెషేంట్ లను జాయిన్ చేసుకోవడం లేదు అని బోర్డులను పెట్టిమరీ రోగుల్ని తిప్పి పంపుతున్నారు.
కరోనా వస్తే కడప లో ఒక వైద్యం కరువే. కరోనా పెషేంట్ గడప దాటితే వైద్యం దొరకదు. కడప దాటి పోతేనే వైద్యం. స్వయంగా డబ్బు పెట్టి వైద్యం చేయించు కుందాం అన్నా బెడ్ దొరకని పరిస్థితి ఏర్పడింది.
కడప నగరంలో ఉన్న ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్ ల యాజమాన్యం అందరూ కలిసి ఈ రోజు కడప IMA హలులో సమావేశమయ్యారు.
ప్రభుత్వ అధికారులు నిబంధనల పేరుతో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాన్ని కేసులు పెట్టి, జరిమాన వేసి వేధిస్తున్నారనే కారణంతో హాస్పిటళ్లను స్వచ్ఛందoగా మూత వేశారు.