ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ అన్నారు. మొన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లు , డ్రైనేజీ అస్తవ్యస్తంగా తయారైందనీ బస్తీవాసులు కార్పొరేటర్ కు విన్నవించగా సోమవారం కార్పొరేటర్ ఇంజనీరింగ్ , శానిటేషన్ విభాగం అధికారులతో కలిసి కుమ్మరి కుంట, న్యూ రాంనగర్, చిల్కానగర్ మర్రిచెట్టు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య , డ్రైనేజీ సమస్యలను సత్వరమే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ , ఏదుల కొండల్ రెడ్డి మాస శేఖర్, రామానుజం, సదానంద చారి, యాదగిరి, రమేష్, తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి