తెలంగాణ సిద్దాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా నేడు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో జాగృతి సంస్థ ఆవిర్భవించిన రోజు.
ఈ సందర్భంగా జాగృతి జండాను ఎగురవేసారు. ఈ సందర్భంగా జాగృతి రాష్ట్ర నాయకులు, 15వ, వార్డు కౌన్సిలర్ K.L.N రావు, జాగృతి జిల్లా నాయకులు SK. మస్తాన్ మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ సర్ తెలంగాణ తొలి ఉద్యమం నుండి మలిదశ ఉద్యమం వరకు ఆజన్మాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పోరాడిన కర్మయోగి అని కొనియాడారు.
తెలంగాణ భావజాల వ్యాప్తి ద్వారా ప్రజల్లో ఉద్యమ ఆకాంక్షను రగిలించారు అన్నారు. జయశంకర్ సర్ మార్గదర్శకత్వంలోనే K. C. R తెలంగాణను సాధించారన్నారు.
జయశంకర్ సర్ ఆలోచనా విధానంతోనే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కల్వకుంట్ల కవిత జాగృతి సంస్థను ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి పట్టణ కన్వీనర్ దుండిగాల నారాయణ,మేళ్ళచెర్వు మండల కన్వీనర్ Md జాన్ షరీఫ్, మహిళా కన్వీనర్ బోధ లక్ష్మీ, మామిడి పన్నీరు, N.రఘురాం, జైత్రామ్ నాయక్, చింతకాయల రాము, బానోతు ప్రసాద్,నర్సింహారావు, యాకయ్య,రహీమా,నవీన్,జానీ తదితరులు పాల్గొన్నారు.