కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో అంగన్వాడీల ఆధ్వర్యంలో సామూహిక సీమంతం అక్షరభ్యాసం తోపాటు అన్నప్రసన్నం కార్యక్రమాలను గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా పౌష్టికమైన ఆహారాన్ని తీసుకొని గర్భిణీలు పండులాంటి బిడ్డలను కానాలన్నారు. అందరూ ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే అంగన్వాడీ కేంద్రంలో ద్వారా పౌష్టికమైన ఆహారమును అంద చేస్తుందన్న విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం ఐదుగురు గర్భిణులకు నిర్వహించారు. ఇద్దరు విద్యార్థులకు అక్షరభ్యాసం చేయించారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు చేసిన పిండి వంటకాల రుచి చూశారు. కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ పటేల్తో పాటు ఉప తహసీల్దార్ మునీరుద్దీన్,ఎంపీడీవో ఆనంద్ ఐసీడీఎస్ సీడీపీవో సునందా సూపర్వైజర్ కొమ్మురవ్వ , పెద్దకొడప్గల్ సూపర్వైజర్ పద్మావతి పాల్గొన్నారు.
జీ లాలయ్య సత్యం న్యూస్ రిపోర్టర్ జుక్కల్