సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు మూడు లక్షల రూపాయలు ఉండవచ్చు. ఈ సందర్భంగా ఒక టాటా ఏసీ, రెండు కార్లు, స్వాధీనం చేసుకొని ఆరుగురు పై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
కోదాడ DSP రఘు మాట్లాడుతూ అసాంఘీక కార్యకలాపాలు ఎవరు నిర్వహించినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిషేధిత గుట్కా ఎవరు అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రభుత్వ బియ్యం పక్కదారి పట్టించే వ్యక్తులపై పీడీ యాక్ట్ పెడతామని ఆయన హెచ్చరించారు. గుట్కా ప్యాకెట్లను అమ్ముతున్న వ్యక్తులను అత్యంత చాకచక్యంగా పట్టుకున్న హుజూర్ నగర్ సిఐ రాఘవరావు,SI ప్రసాద్ గౌడ్ ను అభినందించారు.