28.2 C
Hyderabad
May 24, 2025 09: 17 AM
Slider నల్గొండ

పదోన్నతి ద్వారా బాధ్యత మరింత పెరుగుతుంది

#Nalgonda SP Narmada

పదోన్నతి పొందడం ద్వారా మరింత బాధ్యత పెరుగుతుందని పెరిగే బాధ్యతకు అనుగుణంగా ప్రజలలో పోలీస్ శాఖ గౌరవం  మరింత పెంచేలా పని చేయాలని నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ సి.నర్మద అన్నారు. శుక్రవారం హెడ్ కానిస్టేబుల్ నుండి ఏ.ఎస్.ఐ.లు పదోన్నతి పొందిన సయ్యద్ సుఫియాన్ అలీ, మల్కియార్ రాజు, ఎం.డి.ఖయ్యిముద్దీన్ లకు ఆమె అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లభించిన పదోన్నతి ద్వారా పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధిత ప్రజలకు న్యాయం అందించేలా పని చేయడం ద్వారా ప్రజల అభిమానం పొందాలన్నారు. విధి నిర్వహణ క్రమంలో పదోన్నతి ద్వారా  బాధ్యత మరింత పెరుగుతుందని, ప్రజలకు సమర్ధవంతంగా సేవలందించి వారి అభిమానం పొందాలని సూచించారు.

 పోలీస్ అధికారులు తమకు లభించిన పదోన్నతిని మరింత సమర్ధవంతంగా ప్రజలకు సేవ చేసే విధంగా, అనేక రకాల సమస్యలతో పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు న్యాయం అందిస్తూ మంచి పేరు పొందాలన్నారు. ప్రజాభిమానం పొందేలా పని చేస్తూ ముందుకు సాగాలని, తద్వారా పోలీస్ శాఖ గౌరవాన్ని ప్రజలలో మరింత పెంచేలా విధి నిర్వహణ చేయాలని చెప్పారు.

కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య తదితరులున్నారు.

Related posts

పరిటాల సునీత పాదయాత్రను అడ్డుకోలేదు: డీఎస్పీ

mamatha

మానవత్వం:అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన పోలీస్ లు

Satyam NEWS

నడిరోడ్డుపై నాగుపాము… నిలిచిపోయిన ట్రాఫిక్

mamatha

Leave a Comment

error: Content is protected !!