31.2 C
Hyderabad
April 19, 2024 05: 10 AM
Slider కడప

రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నిరసన….

#rajampet

కడప జిల్లా రాజంపేట ఆర్ అండ్ బి బంగ్లా వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం సిఐటియు ఎఐటియుసి రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు అఖిలభారత కమిటీలు పిలుపులో భాగంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా సీఐటీయూ నాయకులు యం. ఎస్.రాయుడు , మహేష్,దేవరా, సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహ సర్వేపల్లి తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రైతు చట్టాలను రద్దు చేయాలని, లేబర్ కోడ్ లు రద్దు చేయాలని పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.ఆదాయపు పన్ను చెల్లించని ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలని, ఎయిర్ ఇండియా , ఎల్ఐసి,రైల్వే , బ్యాంకులు ప్రైవేట్ రంగానికి ఇచ్చే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

కరోనా కాలం లో చనిపోయిన ప్రతి కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని.200 రోజులు ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

Related posts

భూములతో దందా చేస్తున్న సర్కార్

Satyam NEWS

కల్వకుర్తిలో పట్టపగలే విజృంభిస్తున్న దొంగలు

Satyam NEWS

మమతా బెనర్జీకి షాక్ ఇచ్చిన సీబీఐ

Satyam NEWS

Leave a Comment