కడప జిల్లా రాజంపేట ఆర్ అండ్ బి బంగ్లా వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం సిఐటియు ఎఐటియుసి రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు అఖిలభారత కమిటీలు పిలుపులో భాగంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా సీఐటీయూ నాయకులు యం. ఎస్.రాయుడు , మహేష్,దేవరా, సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహ సర్వేపల్లి తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రైతు చట్టాలను రద్దు చేయాలని, లేబర్ కోడ్ లు రద్దు చేయాలని పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.ఆదాయపు పన్ను చెల్లించని ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలని, ఎయిర్ ఇండియా , ఎల్ఐసి,రైల్వే , బ్యాంకులు ప్రైవేట్ రంగానికి ఇచ్చే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
కరోనా కాలం లో చనిపోయిన ప్రతి కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని.200 రోజులు ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు.