పెళ్లి చేసుకుంటానన్నాడు మోసం చేశాడు పాపం ఆ యువతి ఏం చేయాలి? అందుకే వాటర్ ట్యాంక్ ఎక్కింది. అందరికి తెలిసేలా నిరసన తెలుపుతున్నది. ఆ అమ్మాయి పేరు రవళి.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఖాదరగూడెం గ్రామంలో రవళి అనే యువతి తెల్లవారు జామునే వాటర్ ట్యాంక్ ఎక్కి తన ప్రియుడిని తనకు అప్పగించాలని డిమాండ్ చేస్తోంది.
ఈ నెల 1న కూడా తనకు న్యాయం చేయాలంటూ గ్రామ పంచాయితీ కార్యాలయం ముందు ఆమె ఆందోళన చేసింది. పోలీసులు కౌన్సిలింగ్ ఇప్పించి పంపించడంతో తన స్వగ్రామమైన చెంజర్లకు వెళ్లిపోయిన ఆమె మరుసటి రోజు తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోకు తెలపిపుతై లేఖ కూడా రాసింది.
అయితే ఆమె బంధువులు వద్దని వారించడంతో తన ప్రయత్నాన్ని విరమించుకుని మళ్లీ పోరాటం చేస్తోంది.
ఆదివారం తెల్లవారుజామునే ఖాదరగూడెం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.