జాతీయ పతాకం విషయంలో కూడా కమర్షియల్ ఆలోచనలు చేస్తున్న మున్సిపాలిటీ పాలకవర్గంపై నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ, మండల బిజెవైఎమ్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. క్లాక్ టవర్ పక్కన ఉన్న 100 అడుగుల జాతీయ జెండాను మునిసిపల్ అధికారులు ప్రతి సారీ మారుస్తూ మనోభావాలను దెబ్బతిస్తున్నారని వారు తెలిపారు. జాతీయ జెండా నాణ్యమైన బట్టతో కొట్టించి ఏడాదికి ఒక మారు మార్చేలా చూడాలి కానీ ప్రతి నెలా జాతీయ జెండాను మార్చడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్, బీజేవైఎం మండల అధ్యక్షులు నరేష్ చారి, కౌన్సిలర్లు కొంతం మురళి, సాయి కుమార్ బీజేవైఎం కార్యకర్తలు భరత్, ఉదయ్ గౌడ్, ప్రణయ్ ,లక్కీ , బబ్లు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post