రైతు ప్రతినిధులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ నందు కేంద్ర ప్రభుత్వం రైతు ప్రతినిధులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రైతు సంఘం,వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఢిల్లీలో 11 నెలల పాటు సాగిన రైతాంగ పోరాటం అనంతరం రైతు ప్రతినిధులకు ప్రధాని మోడీ అనేక వాగ్దానాలు చేశారని, అందులో నేటికీ ఏ ఒక్కటి అమలు చేయలేదని అన్నారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని,పోరాటంలో మరణించిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని, మద్దతు ధర గ్యారెంటీ చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పల్లె వెంకట రెడ్డి,దుగ్గి బ్రహ్మం,పోతనబోయిన హుస్సేన్,ఎలక స్వామి గౌడ్,చిన్న వీరమల్లు,రేపాకుల వీరస్వామి,మీసాల వీరబాబు,శ్రీను వెంకన్న,గణపవరపు శ్రీను,వెంకటేశ్వర్లు నరేష్,రాజు,దుగ్గి వేణు,సిద్దాల వెంకటయ్య,షేక్ సైదా,పిన్నపురెడ్డి వెంకట రెడ్డి,అబ్రహమ్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్