సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం పివీ రావు మాలమహానాడు రాష్ట్ర కమిటి పిలుపుమేరకు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు సూదుల రాములు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పీవీ రావు మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ నివాస గృహముపై జరిగిన దాడిలో పాల్గొన్న దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పోతుల జ్ఞానయ్య, రాష్ట్ర అధ్యక్షుడు లచ్చి మళ్ళ నరసింహారావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోలే రామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ఇంకా, రాష్ట్ర కార్యదర్శి చప్పిడి నరసింహారావు, మహిళా జిల్లా అధ్యక్షురాలు రమణ, సూర్యపేట నియోజకవర్గ అధ్యక్షుడు బోయిళ్ళ జానయ్య, హుజూర్ నగర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సీలం స్వరూప, హుజూర్ నగర్ పట్టణ మరియు మండల అధ్యక్షులు కె. యోహాన్, డి. బాబురావు, సీనియర్ నాయకులు మొండెం లక్ష్మీనర్సు, మహిళా అధ్యక్షురాలు బీరోలు కవిత, తదితరులు పాల్గొన్నారు.