బిచ్కుంద మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం ముందు సి ఐ టి యు ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు , అనంతరం ఎంపీడీవో ఆనంద్ క వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సిఐటియు జుక్కల్ నియోజకవర్గ కన్వీనర్ సురేష్ గొండ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన జీవో 51 ప్రకారం గ్రామపంచాయతీ లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 8500 రూపాయలు నెలకు జీతం చెల్లించాలని వారికి ఈఎస్ఐ, పిఎఫ్, యూనిఫాంలు ,శానిటైజర్ కిట్లు అందజేయాలన్నారు .
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనియెడల దశలవారీగా ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల అధ్యక్షులు సాయిలు, వీరయ్య, మోహన్ గౌడ్, బాలయ్య కార్మికులు ఉన్నారు.