పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాయచోటి పట్టణంలో నిర్వహించిన మానవహారంతో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. యన్.ఆర్.సి, సి.ఏ.ఏ, యన్.పి.ఆర్ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కడప జిల్లా రాయచోటి పట్టణంలోని బంగ్లా సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీలు పెద్ద ఎత్తు పాల్గొన్నారు. మహిళలు కూడా భారీగా తరలి రావడంతో పట్టణంలో ట్రాఫిక్ స్థంభించిపోయింది.