ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ లను దేశంలో ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయనివ్వబోమని నరసరావుపేట ముస్లిం జేఏసీ నాయకులు అన్నారు. స్థానిక ఎస్.ఆర్.కె టి కాలనీ లో నీ 14 వ లైనులో షేక్ నాగూర్ సుభాని ఇంటి వద్ద NRC, NPR,CAA మీద నేడు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట ముస్లిం జేఏసీ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో SRKT స్థానికులు నాగూర్ కరీం మాట్లాడుతూ ముస్లింల మీద జరుగుతున్న అన్యాయాలను తిప్పికొట్టాలని, NRC బిల్లును ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని కోరారు. ఈ బిల్లు తోబాటు పౌరసత్వ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం jac నాయకులు గఫార్, కరీముల్లా, రజాక్, మునాఫ్, బాబు, gk , కరీం భాష, రహీమ్, మౌలాలి, మస్తాన్, ఆరిఫ్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. కాలనీలోని స్థానికులు అయిన మాస్టర్ మున్వర్ షరీఫ్, భాష, నాగూర్, వలి, అబ్దుల్ కరీం, నజీర్, రఫీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.