విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లబ్దిదారులు నిరసన
ఓవైపు చంకలో చండి బిడ్డ..మరోవైపు ఎనిమిదేళ్ల క్రితం పెను బీభత్సం సృష్టించిన హుదూద్ పుణ్యమా కట్టిన ఇండ్లకు కరెంట్ మంజూరు చేయాలని లబ్దిదారుల నినాదపు దృశ్యాలు…ఇవీ విజయనగరం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ కు కూతవేటు దూరంగా అదీ కలెక్టర్ బంగ్లాకు ఆనుకుని ఉన్న ప్రదేశంలో లబ్దిదారులు నిరసన ప్రదర్శనలు. పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జగనన్న ఇండ్లను ప్రభుత్వమే కట్టివ్వాలని, టిడ్కో ఇండ్లను లబ్దిదారులకు అప్పచెప్పాలని, నివాసం ఉన్నచోటే పేదలకు పట్టాలు ఇవ్వాలని, అలాగే హుదూద్ ఇండ్లకు తక్షణం కరెంట్ ఇవ్వాలంటూ నగరంలోని హౌసింగ్ శాఖ వద్ద లబ్దిదారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్బఃంగా పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ…కలెక్టరేట్ కు కూతవేటు దూరంలో ఉన్న గంజిపేటలోగత 40 ఏళ్లుగా అక్కడ ఉన్న పూరి పాకలలోనే పడి కాలం వెళ్ల దీస్తున్నారే తప్ప ఇప్పటి వరకుఏ ఒక్కప్రభుత్వం వారికి శాశ్వత ఇండ్లు నిర్మాణం చేపట్టలేదని అన్నారు. ఇరవై ఏళ్లుగా సీఐటీయూ ఇండ్లను కట్టించాలిని ధర్నా చేస్తే ఆ రోజు ఇండ్ల తీసేసి33కేవీ ఇండ్లకడతామని వస్తే..మేము అడ్డుకున్నామన్నారు.తాజా గా అక్కడి ఇండ్లు తీసేసి సచివాలయం కట్టాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు.అది ప్రభుత్వం స్థలం కాబట్టిపేదలందరికీ స్థలాలతోపాటు ఇండ్లు కట్టించిఇవ్వాలని పట్టణ పౌరసంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోందన్నారు.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం