పట్టపగలు పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం కల్వచర్ల గ్రామం వద్ద వాహనాన్ని ఆపి కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హైకోర్టు లాయర్లు గట్టు వామన్ రావు, గట్టు నాగమణి దంపతులను అతి దారుణంగా చంపటం తీవ్రమైన చర్య అని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కోర్టును బహిష్కరించి న్యాయవాదులు తమ నిరసన ప్రదర్శనను పుర వీధులలో చేశారు. సి ఐ టి యు న్యాయవాదులకు మద్దతుగా ప్రదర్శనలో పాల్గొన్న రోషపతి మాట్లాడుతూ తక్షణమే నిందితులను పట్టుకొని ఉరిశిక్ష విధించాలని, నిందితుల పక్షాన ఏఒక్క న్యాయవాది కూడా వాదించ కూడదని అన్నారు.ఈ సంఘటన వెనక ఎంతటి వారున్నా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.