27.7 C
Hyderabad
April 26, 2024 03: 02 AM
Slider ప్రత్యేకం

Protest on police: నేరం చేసిన వైసీపీ నేతపై చర్య తీసుకోరా?

#vinukonda

వైసీపీ పార్టీకి చెందిన వాళ్లు నేరం చేసినా పోలీసులు పట్టుకోరా? శిక్ష పడేలా చేయరా?…. కచ్చితంగా చేయం అని గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలోని పోలీసులు చెబుతున్నారు…. అలాగే చేస్తున్నారు… అందుకే గ్రామస్తులు ఈపూరు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

ఈపూరులో ఒంటరిగా  పొలం పనులు చేసుకుంటున్న మహిళపై రామాంజి అనే వైసీపీ కార్యకర్త దారుణానికి పాల్పడ్డాడు. చుట్టు పక్కల పొలంలో పనులు చేసే వారు కేకలు వేయడంతో రామాంజి అక్కడి నుంచి పరారయ్యాడు. దాంతో బాధితురాలు ఈపూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలి బంధువులు ఈపూరు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా బాధితులు పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. వైసీపీ కార్యకర్త రామాంజిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడు రామాంజి వైసీపీ కార్యకర్త కావడంతో పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.

Related posts

అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనండి

Bhavani

ముఖేష్ అంబానీ ఇంట్లో మరో శుభకార్యం

Satyam NEWS

మంత్రి వర్గం నుంచి ఈటెల రాజేందర్ బర్తరఫ్

Satyam NEWS

Leave a Comment