తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చం నాయుడు, జె.సి. ప్రభాకర రెడ్డి అక్రమ అరెస్టులకు నిరసనగా కోవిద్ నిభందలకు అనుగుణంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఎఫ్ ఐ ఆర్ కాపీలను తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరు కృష్ణయ్య ,పెనుమల్లి శ్రీహరిరెడ్డి, పాలూరు వెంకటేశ్వర్లు,పాలపర్తి శ్యాం,ఎస్ కె నాసీర్,మహ్మద్, అగ్గి మురళి,మారుబోయిన వెంకటేశ్వర్లు,సోమవరపు సుబ్బారెడ్డి ఇంటూరు విజయ్,ప్రదీప్,రవి తదితరులు పాల్గొన్నారు