తెలంగాణ రాష్ట్ర 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తలకొండపల్లి జెడ్ పి టి సి ఉప్పల వెంకటేష్ స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో కింద కూర్చొని తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కొట్లాడి సాధించుకున్న త్యాగధనుల తెలంగాణలో, ఇప్పటి వరకు ఏ హామీలు నేటికీ నెరవేర్చ లేని ఈ ప్రభుత్వం పై నిరసన తెలిపారు.
అలాగే ఈ కరోనా వల్ల ప్రభుత్వం ఇస్తానన్న 1500 రూపాయలు రేషన్ కార్డ్ ఉన్న వాళ్లకు లేని వాళ్లకు తలకొండపల్లి మండలంలో గాని, రాష్ట్రంలో గానీ చాలా వరకూ అందలేదని ఎమ్మార్వో ఆఫీస్ వద్ద కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మండల కో ఆప్షన్ నెంబర్ ఇమ్రాన్, తలకొండపల్లి సర్పంచ్ లలిత జ్యోతి గారు, సర్పంచులు అధ్యక్షులు గోపాల్ నాయక్ గారు, తలకొండపల్లి స్థానిక ఎంపిటిసి రాజు, తలకొండపల్లి సింగల్ విండో డైరెక్టర్ శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.