ఉత్తర ప్రదేశ్ లో కొనసాగుతున్న అత్యాచారాలకు నిరసనగా ఏలూరులో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యక్రమం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పశ్చిమ గోదావరి జిల్లా ఇంచార్జ్ బయ్యారపు రాజేశ్వరరావు మాట్లాడారు.
మాదిగ నిందితులకు తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికార ప్రతినిధి ఎర్ర నాగమల్లేశ్వరరావు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏలూరు లో పాత బస్టాండ్ సెంటర్లో కొవ్వొత్తులతో భారీ నిరసన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఏలూరు నాయకులు తదితరులు హాజరయ్యారు.