27.7 C
Hyderabad
April 26, 2024 05: 09 AM
Slider గుంటూరు

వ్యవసాయ మార్కెట్ యార్డులను నిర్వీర్యం చేస్తున్నారు

#TDPNarasaraopet2

రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు సబ్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.

రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని, వ్యవసాయ మార్కెట్ యార్డులు కొనసాగించాలని నరసరావుపేట సబ్ కలెక్టర్‍ శ్రీవాస్ నుపుర్ అజయ్ కుమార్ కు అందచేసిన వినతిపత్రంలో కోరారు.

రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డులను నిర్వీర్యం చేస్తున్నారని, ధరల స్థిరీకరణ నిధిని దుర్వినియోగం చేస్తున్నారని డాక్టర్ చదలవాడ అన్నారు.

రైతులు పండించిన పంట దళారుల పాలవుతోంది..రేపు కార్పోరేట్ సంస్థలకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

సుబాబులు, మిర్చి రైతులను దోపిడీ చేసే ప్రయత్నం జరుగుతోంది మార్కెట్ యార్డు వ్యవస్థను చట్టబద్ధం చేయాలి అని డిమాండ్ చేసినట్లు చదలవాడ అరవింద బాబు తెలిపారు.

Related posts

సస్పీషియస్: అపార్ట్ మెంట్ పై నుంచి దూకిన యువతి

Satyam NEWS

హౌడీ మోడీపై వాణిజ్య వర్గాల ఆశలు

Satyam NEWS

విశాఖ డెయిరీ సౌజ‌న్యంతో ప్రేమ‌స‌మాజంలో అద‌న‌పు వ‌స‌తి భ‌వ‌నాలు

Satyam NEWS

Leave a Comment